వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తున్న సమయంలో ఐసీఎంఆర్ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15లోగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ నగరానికి చెందిన భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)తో కలిసి పని చేస్తోంది. కరోనాకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ను మనుషులపై ప్రయోగించేందుకు డీసీజీఐ అనుమతి లభించింది. దీంతో క్లినికల్ ట్రయల్స్ను నిర్వహించేందుకు ఐసీఎంఆర్ నిమ్స్ను ఎంచుకుంది. అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలు కలిగిన నిమ్స్లో ఈ నెల 7 నుంచి క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ట్రయల్స్కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.మనోహర్ తెలిపారు.శనివారం ఆయన మాట్లాడుతూ.. నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్కు ఎంపిక చేసినట్లు చెప్పారు. దేశంలో ట్రయల్స్ నిర్వహిస్తున్న 12 సంస్థల్లో నిమ్స్ ఒకటి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 7 నుంచి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియలో మూడు రకాల వ్యాక్సిన్ను రెండు డోస్ల చొప్పున ఇస్తామన్నారు. ఈ వ్యాక్సిన్లో కూడా 3 మైక్రోగ్రాములు ఒక రకమైన వ్యాక్సిన్, మరొకటి 6 మైక్రో గ్రాములు ఉంటుందన్నారు. ఫేస్–1, ఫేస్–2 కింద ఈ క్లినికల్ ట్రయిల్స్ చేపడతామన్నారు. మొదటి ఫేస్ 28 రోజులు ఉంటుందని వివరించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa