తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా మారింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వానలతో ఉక్కుపోత తగ్గి ప్రజలు ఉపశమనం పొందారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు వర్షాలు పడే అవకాశం వుంది. ఏపీ తీరప్రాంతానికి, దక్షిణ ఒడిసా తీరానికి పశ్చిమ దిశగా ఆవర్తనం నెలకొంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో శనివారం విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆది, సోమవారాల్లో ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈనెల 8న దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇక కొన్నిజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మన్యంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. వాతావరణం చల్లబడింది.తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుసే అవాకశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు విరివిగా పడడంతో తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయపనులు ఊపందుకున్నాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa