ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు: ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాయ‌లంలో కరోనా కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 05, 2020, 10:00 AM

ఆదోని పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. పెద్దకడబూరు చెందిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ నిమిత్తం కార్యాలయానికి  వచ్చారు. వారికి జరిపిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో వారితో కలిసిన వారందరు కలవరానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి అధికారులు తాళం వేశారు. వచ్చిన వారు కార్యాలయంలో తిరిగారు. దీంతో ఉద్యోగులు భయాందోళన చెందారు. నియోజకవర్గ పరిధిలో కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ పాజిటివ్ కేసులు సంఖ్య 540కు చేరుకున్నాయి. పట్టణంలో శక్తి గుడి ఏరియా 2, కార్వాన్ పేట 2, ఎల్బి స్ట్రీట్ 1, సంతపేట 1, ఎస్‌కెడి కాలనీ 1, ఏపీహెచ్బి కాలనీ 1, క్రాంతి నగర్ 1, ఎన్జీవోస్ కాలనీ 1, రూరల్ సంతేకూడ్లూరు 1 చొప్పున కేసులు నమోదైన‌ట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa