ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యజమాని మరణం..కుక్క ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 04, 2020, 12:25 PM

ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న యజమాని ఇక లేదని తెలియడంతో ఓ శునకం పరుగు పరుగున భవనం నాలుగో అంతస్తు పైకి చేరి అక్కడి నుంచి దూకేసింది. అక్కడికక్కడే మరణించింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్పూర్‌లో వైద్య శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అనితా రాజ్ సింగ్ 12 ఏళ్ల కిందట ఓ కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకున్నారు. పుట్టిన ఒకట్రెండు రోజుల్లోనే తల్లి నుంచి విడిపోయిన ఆ కుక్క పిల్ల పోషణ లేక చిక్కి శల్యమైంది. దాని శరీరం చుట్టూ కీటకాలు ముసిరాయి. అలాంటి స్థితిలో ఆ కుక్క పిల్లను తీసుకొచ్చిన డాక్టర్ అనిత దానికి సపర్యలు చేసి ప్రాణాలు నిలిపారు. దానికి ‘జయ’ అని పేరు పెట్టి కుటుంబంలో ఓ సభ్యురాలిగా పెంచుకున్నారు.అనారోగ్య కారణాలతో డాక్టర్ అనితా సింగ్‌ను కొద్ది రోజుల కిందట ఆస్పత్రిలో చేర్పించారు. నాటి నుంచి ఆ శునకం ఇంట్లో దిగాలుగా కూర్చుంది. యజమాని ఆరోగ్యం గురించి బెంగ పెట్టుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డాక్టర్ అనితా సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం (జులై 1) ప్రాణాలు విడిచారు. ఆమె మృతదేహాన్ని కాన్పూర్‌లోని బరా-2 పరిధిలోని మాలిక్‌పురంలో ఉన్న ఆమె నివాసానికి తీసుకొచ్చారు. 12 ఏళ్లుగా తనను పెంచి పోషించిన యజమానిని విగతజీవిగా చూడగానే ఆ శునకం దిగ్భ్రాంతికి గురైంది. భవనం నాలుగో అంతస్తు పైకెక్కి అక్కడ నుంచి ఒక్కసారిగా దూకేసింది. శునకం ప్రాణాలు తీసుకుందని తెలియడంతో స్థానికులు అక్కడికి పోటెత్తారు. వైద్యురాలిపై ఆ మూగజీవి పెంచుకున్న ప్రేమను చూసి షాక్‌కు గురయ్యారు. కుక్క మృతదేహాన్ని ఇంటికి సమీపంలోనే పూడ్చిపెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa