ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతీ పౌరుడికి రూ.2,000 ఇవ్వనున్న కేంద్రం.. ఇది పక్కా ఫేక్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 04, 2020, 12:23 PM

కరోనా ప్రారంభమైనప్పటి నుండి వివిధ రకాల ఫేక్ న్యూస్ హల్చల్ చేస్తూ జనాల్ని అయోమయానికి గురిచేస్తున్నాయి. తాజాగా మరో ఫేక్ న్యూస్ వైరల్ అయింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుండడంతో కేంద్రం ప్రతీ ఒక్క పౌరుడికి రూ.2,000 చొప్పున ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ప్రక్రియ ప్రారంభించనుందని దాని సారాంశం. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైంది. దీనిపై విచారించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఇది ఫేక్ న్యూస్ అని తేల్చింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. పుకార్లని నమ్మవద్దని ప్రజల్ని కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa