ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతనంగా మంజూరైన 108 వాహనం ప్రారంబించిన సీతారామిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 04, 2020, 11:37 AM

ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని గౌరవనీయులు ఎమ్మిగనూర్ ఆర్టీసి డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు వై. సీతారామి రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రాలయం మండలానికి నూతనంగా మంజూరైన 108 వాహనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మ రాఘవేంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దాయన చేతుల మీదుగా 108 వాహనానికి ప్రత్యేక పూజలు చేపట్టి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో కరోనా టెస్టు లు నిర్వహించడం జరుగుతుందని ముందు జాగ్రత్త లు తీసుకోవడం తోనే మరణాల సంఖ్య తగ్గిందన్నారు. కరోనా వ్యాధి విజృంబిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అత్యవసరమైతే తప్పా బయటకు రాకూడదని దీనికి తోడు మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. అత్యాధునిక, సామాగ్రి తో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి మండలానికి 108, 104 వాహనం ను కేటాయించడం అభినందిచదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ కృష్ణయ్య, ఎస్ఐ లు వేణు గోపాల్ రాజ్, ఎర్రన్న, వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షులు జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, పీఎ వెంకట్రామి రెడ్డి, మాజీ సర్పంచ్ టి. భీమయ్య, మాజీ ఉప సర్పంచ్ గోరుకల్లు కృష్ణ స్వామి, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి, పులికుక్క రాఘవేంద్ర, నాయకులు శివ కుమార్, హోటల్ పరమేష్, మల్లికార్జున, జనార్దన్ రెడ్డి, జగదీష్ స్వామి, దర్జీ ప్రకాష్, వీరారెడ్డి, రాము, అమిన్ భాషా, దర్జీ ప్రకాష్, రాము, ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa