అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో విషాదం జరిగింది. పెళ్లైన 3 నెలలకే యువజంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ధర్మవరం పట్టణానికి చెందిన శివశంకర్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గౌతమి ఎంబీఏ చదివింది. వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరు కుటుంబ నేపథ్యాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో వీరు పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత ఈ జంట శివశంకర్ ఇంట్లోనే కాపురం పెట్టింది. శివశంకర్ తన తండ్రి బదులుగా మున్సిపాల్టీలో పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ దంపతుల మధ్య విబేధాలు వచ్చాయి. అప్పటికి ఇంట్లో పెద్దలు సర్ది చెప్పారు.ఈ విషయం గౌతమి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో గౌతమి తల్లిదండ్రులు గౌతమిని వారి ఇంటికి తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి శివశంకర్ గౌతమి పుట్టింటికి వెళ్లాడు. అక్కడ భోజనం చేసిన తర్వాత మరోసారి దంపతులు గొడవపడ్డారు. అంతా నిద్రపోయాక గౌతమి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి వేళ నిద్రలేచి చూసిన శివశంకర్ షాకయ్యి అత్తమామలకు చెప్పాడు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయిన శివశంకర్ లక్ష్మీ చెన్నకేశవపురం వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్షణికావేశంలో యువజంట బలికావడంతో అక్కడ వారి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa