ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా మృతుల అంత్యక్రియలకు రోబోట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 03, 2020, 03:11 PM

కరోనా వైరస్ ఎంతగా కలవర పెడుతోందో తెలిసిందే. వైద్యులు సైతం ఎన్నో జాగ్రత్తలను పాటిస్తూ వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే, కరోనాతో చనిపోయేవారి పరిస్థితే దయనీయంగా మారింది. వారి శవాలను కుటుంబ సభ్యులు కూడా తీసుకోవడం లేదు.ఈ నేపథ్యంలో చెన్నైకు చెందిన రెండు సంస్థలు మనుషులు అవసరం లేకుండానే అంత్యక్రియలు జరిపే రోబోట్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిని చూడటానికి అచ్చం స్ట్రెచర్లు తరహాలోనే ఉంటాయి. ‘రెస్క్యూయర్ అంబులెన్స్’గా పిలిచే ఈ రోబోల నమూనాలను మాటో ఎలక్ట్రిక్ మొబిలిటీ, జాఫీ రోబోస్ కంపెనీలు రూపొందించాయి. రెస్క్యూయర్ అంబులెన్స్‌లో మృతదేహాన్ని పెడితే చాలు, అదే గుంత వద్దకు వెళ్లి పూడ్చి పెడుతుంది.దీనివల్ల సిబ్బందికి, కుటుంబ సభ్యులకు కరోనా సోకుతుందనే భయమే ఉండదు. అంత్యక్రియలు కూడా గౌరవంగా ముగించవచ్చు. ప్రస్తుతం దీన్ని చిన్న సైజులతో తయారు చేశారు. ప్రభుత్వం అనుమతిస్తే.. వీటిని పెద్ద సైజులో తయారు చేసి ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa