లాక్ డౌన్ కారణంగా అనేక మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సమయంలో సొంతంగా చిన్న చిన్న పరిశ్రమను, వ్యాపారాలను ప్రారంభించేందుకు చాలా మంది సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి వారికి CNG ప్లాంట్లను ఏర్పాటు చేసి మంచి ఆదాయం పొందవచ్చు. ఈ వివరాల గురించి ఒక సారి తెలుసుకుందాం.బయో సిఎన్జికి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. బయో సిఎన్జీ తయారు చేసిన తరువాత మిగిలిన ఆవు పేడ ఎరువులుగా పనిచేస్తాయి. ఆ ఎరువును రైతులకు అమ్మడం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవచ్చు. బయో సీఎన్జీని వాణిజ్యపరంగా ఉపయోగించవచ్చు. వ్యవసాయ-రంగ సహకార సంస్థ అయిన నాఫెడ్ వ్యవసాయ వ్యర్థాల నుండి BIO CNG ను ఉత్పత్తి చేయడానికి దేశవ్యాప్తంగా 100 ప్లాంట్లను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో రూ .5 వేల కోట్ల పెట్టుబడితో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఆసక్తి ఉన్న వారు బయో CNG ప్లాంట్ను ఇన్స్టాల్ చేయడం ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆవు, గేదె, ఇతర పశువుల పేడతో పాటు, కుళ్ళిన కూరగాయలు, పండ్ల నుండి BIO CNG తయారవుతుంది. బయో సిఎన్జి ప్లాంట్ వ్యర్థాల ద్వారా నడుస్తుంది. ఇందులో ప్రత్యేక యంత్రాలు ఏర్పాటు చేశారు.బయో సిఎన్జి ప్లాంట్లు మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా సహా ఇతర రాష్ట్రాల్లో నడుస్తున్నాయి. ఈ ప్లాంట్లలో VPSA(Vacuum Pressure Swing Adsorption) సాంకేతికతను ఉపయోగిస్తారు. ఈ యంత్రాల ద్వారా ఆవు పేడను శుద్ధి చేయడం ద్వారా మీథేన్ తయారవుతుంది. అనంతరం మీథేన్ కుదించి సిలిండర్లో నింపబడుతుంది. ఈ ప్లాంట్ స్థాపించడానికి కొద్దిగే ఖర్చు అవుతుంది. కానీ ఇది మంచి సంపాదనకు మార్గంగా మారుతుంది. కాలుష్య స్థాయిని తగ్గించడానికి మోదీ ప్రభుత్వం బయో సీఎన్జీని ప్రోత్సహిస్తోంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa