ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోలు విషయంలో జరిగిన అవకతవకలపై ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు టీడీపీ సీనియర్ నాయకుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నిన్నటి వరకు గుంటూరు జీజీహెచ్ లో ఆయనకు అధికారులు చికిత్స అందించారు. నిన్న ఆసుపత్రి నుంచి ఆయనను డిశ్చార్జ్ చేయగా అధికారులు మరోమారు ప్రశ్నించి అక్కడి నుంచి విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అచ్చెన్న ఆరోగ్యం బాగాలేదని, విచారకు ఎప్పుడు హాజరు కావాలని ఆదేశిస్తే అప్పుడు తప్పకుండా హాజరు అవుతారని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో అచ్చెన్నాయుడు తరపు లాయర్లు వాదించారు.వాదనలు విన్న ఏసీబీ కోర్టు బెయిల్ కు సంబంధించిన తీర్పును రిజర్వ్ చేసింది. జూన్ 3 వ తేదీన దీనికి సంబంధించి తీర్పు వెలువరించబోతున్నది. అయితే, ఈరోజు అచ్చెన్నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. అచ్చెన్నాయుడు లంచ్ మోహన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు రేపు విచారణ జరపబోతోంది. హైకోర్టులో అచ్చెన్నాయుడికి ఊరట లభిస్తుందా? ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా ? అన్న అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa