పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో అవినీతి జరగలేదన్న జలశక్తి శాఖ నివేదకకు ఏం సమాధానం చెప్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. నందిగామలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల నష్టపరిహారంలోనూ కొందరికి ఎక్కువ, కొందరి తక్కువ ఆరోపణలు కూడా నిజం కాదని, జలశక్తి శాఖ చెప్పినట్లు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో 20శాతం పనులు మాత్రమే జరిగితే నవంబర్ నాటికి 40 గేట్లు ఏలా బిగిస్తారని ఉమా ప్రశ్నించారు. పోలవరంలో 70శాతం పనులు జరిగాయన్న నిజాన్ని అంగీకరించేందుకు ముఖ్యమంత్రికి మనసు రావటం లేదన్నారు. పట్టిసీమ ద్వారా ఐదేళ్ళ తెదేపా ప్రభుత్వంలో 44వేల కోట్ల పంటను కాపాడినట్లు గుర్తు చేసారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa