దేశ వ్యాప్తంగా మోది ప్రభుత్వం పెంచిన పెట్రోలు,డీజల్ ధరలూ తగ్గించాలని ఈ రోజు CPM పార్టీ వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీల పీలుపులో భాగంగా ఆలూరు గ్రామంలో సచివాలయం ముందు ప్లకార్డులు పట్టుకోని నిరసన తెలిపడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కేపీ నారాయణ స్వామి మాట్లాడుతూ క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో మన దేశంలో మాత్రం మోది ప్రభుత్వం రాష్టాలపై వ్యాట్ టాక్సీలు విదీస్తూ గత 22 రోజుల నుండి విఫరితంగా పెట్రోలు, డీజల్ ధరలు పెంచుతుందని అన్నారు.కరోణ వైరస్ విజృభిస్తుండంతో లాక్ డౌన్ లు కారణంగా బడా పెట్టుబడుదారులకు తప్పా,ప్రజలకు పనులు లేక, ఉపాధి లేక, వ్యాపారాలు లేక తీవ్రమైన ఆర్థీక సంక్షోభం నెలకోని వుంటే మోది మాత్రం పుండు మీద కారం చల్లినట్లు, ప్రజల జేబులకు చిల్లు పెడుతూ రోజు రోజుకు పెట్రోలు,డీజల్ ధరలు పెంచటం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు.రానున్న కాలంలో బంగారం కన్నా పెట్రోలు,డీజల్ ధరలు ఎక్కువగా వుంటాయామో అని అన్నారు.రాష్ట్రంలో కూడా జగన్ ప్రభుత్వం కూడా వ్యాట్ టాక్సీ వీదిస్తూ విచ్చలవిడిగా ధరలు పెంచిందని అన్నారు.ఇప్పటికైన మోది ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే పెట్రోలు,డీజల్ ధరలు తగ్గించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ మండల కార్యదర్శి షాకీర్, ఐద్వా మండల కార్యదర్శి రత్నమ్మ, సిపిఎం నాయకులు ఈశ్వర్ గౌడ్, రాజు, ss బాషా, మైన, గోపాల్, రంగనాథ్, గోవర్ధన్, రాధమ్మ, గౌసియా బీ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa