శరీరం సక్రమంగా పనిచేయాలంటే రక్తం శుద్ధిగా ఉండాలి. లేకపోతే, కొత్త వ్యాధులు శరీరంపై దాడి చేసి మనిషిని కుంగదీస్తాయి. అందుకే, ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ రక్తాన్ని శుద్ధిగా ఉంచుకోడానికి ప్రయత్నించాలి. మనం తినే ఆహారం, అలవాట్లు సక్రమంగా ఉన్నప్పుడు రక్తం కూడా శుద్ధిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అవేంటో తెలుసుకుందాం...వ్యాపారం లేదా ఉద్యోగరీత్యా ఎక్కువ సేపు కుర్చొనే వ్యక్తులు రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. ప్రాణాయామం ద్వారా శ్వాసక్రియను అదుపులో ఉంచుకోవచ్చు. శ్వాసక్రియలో సమస్య లేనప్పుడే రక్తం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. నిద్ర సమయంలో శరీరంలోని కండరాలు విశ్రాంతి తీసుకోవడం వల్ల పెద్దగా పని ఉండదు. ఆ సమయంలోనే శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్తుంటాయి. కాబట్టి.. రోజుకు కనీసం 8 గంటలైనా నిద్రపోండి.బీట్రూల్లో శరీరానికి మేలు చేసేత ఫైబర్, ఫొలేట్, విటమిన్ B9, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, విటమిన్-C ఉంటాయి. రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా రక్తనాళాలు సంకోచించాన్ని అరికడుతుంది. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగితే శరీరం టాక్సిన్లు విసర్జించి రక్తాన్ని శుద్ధిగా ఉంచుతుంది. ఎర్ర రక్తకణాలు, రక్త శుద్ధికి, వృద్ధికి తులసి ఆకులు, విత్తనాలు ఎంతో మంచివి.పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తకణాలకు రక్షణ కల్పిస్తాయి.పచ్చని ఆకు కూరలతోపాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి వారంలో ఒక్కసారైనా తీసుకోండి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. రోజూ గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం పిండుకుని తాగితే రక్త సరఫరా మెరుగవుతుంది. ఉసిరి రక్తాన్ని వృద్ధి చేయడమే కాకుండా శుద్ధి చేస్తుంది. రక్తంలో ఐరన్ లోపిస్తే బెల్లం తీసుకోండి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa