కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జూలై 1 నుంచి కంపెనీ ప్రారంభించడం ఇకపై చాలా సులభం. ఇంట్లో కూర్చునే ఆధార్ ద్వారా మీ కంపెనీని నమోదు చేసుకోవచ్చు. సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా సంస్థ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు జూలై 1, 2020 నుండి అమలులోకి వస్తాయి. సంస్థ రిజిస్ట్రేషన్ పొందడానికి ఇప్పుడు కొన్ని పత్రాలను మాత్రమే సమర్పించాల్సి ఉంది. పోర్టల్ లో తెలిపిన సమాచారం ప్రకారం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ( MSME misistry)పెట్టుబడి మరియు వ్యాపారం ఆధారంగా ఎంఎస్ఎంఇల వర్గీకరణకు కొత్త నిబంధనలను తెలియజేసింది.ప్లాంట్, మెషినరీ లేదా పరికరాల వ్యాపారంలో పెట్టుబడులు ఇప్పుడు MSME ల వర్గీకరణకు ప్రాథమిక ప్రమాణాలుగా మారనున్నాయి. ఏదైనా సంస్థ టర్నోవర్ను లెక్కించేటప్పుడు, వస్తువులు లేదా సేవల ఎగుమతి లేదా రెండూ వాటి టర్నోవర్ లెక్కింపు నుండి మినహాయిస్తారు.మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ "MSMEల కొత్త వర్గీకరణ, నమోదు, సదుపాయం ప్రపంచంలోనే చాలా సరళమైనది, వేగవంతమైనది, సులభమైనది. ఇది ఒక విప్లవాత్మక అడుగు అవుతుంది" అని పేర్కొన్నారు..
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa