మూగజీవాలపై దారుణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో ఆవులు, ఏనుగులు, కోతులు, కుక్కలు ఇలా అనేక రకాల జంతువులపై కొందరు తమ పైశాచికత్వం ప్రదర్శిస్తూనే ఉన్నారు. జంతువుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. ఇటీవల కేరళలో గర్భిణి ఏనుగు నోట్లో పైనాపిల్తో కలిపి పేలుడు పదార్థులు తినిపించిన ఘటన మరవక ముందే ఏపీలో ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వేటగాళ్లు పెట్టిన నాటు బాంబు కారణంగా ఆవు తీవ్రంగా గాయపడింది. చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాని మండలం కొగిలేరులో ఈ ఘటన చోటు చేసుకుంది. మేత కోసం వెళ్లిన ఆవు నాటుబాంబుతో పెట్టిన పండును కొరకడంతో పేలింది.ప్రమాదంలో ఆవు నోటి భాగం ఛిద్రమైంది. విషయం తెలిసిన స్థానికులు వెంటనే పశువైద్యుడికి సమాచారం అందించడంతో అతను సకాలంలో చేరుకుని ఆవుకు తగిన చికిత్స చేశారు. పశువులు మేత మేసేందుకు వెళ్లే చోట నాటు బాంబులు పెట్టడంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణాలోని ఖమ్మం జిల్లా అమ్మపాలెంలోనూ ఇలాంటి ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నీళ్లు తాగేందుకు ఊళ్లోకి వచ్చిన కోతిని చెట్టుకు ఉరి వేసి చంపి దారుణానికి పాల్పడ్డాడు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa