ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సీఎం జీవం పోశారు : అబ్బయ్య చౌదరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 30, 2020, 12:57 PM

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జీవం పోశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. ఎంఎస్‌ఎంఈల ద్వారా10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. సింగిల్‌ విండో విధానాన్ని కూడా సీఎం జగన్‌ తీసుకొచ్చారని తెలిపారు. రీస్టార్ట్ ప్యాకేజీ రూపంలో ఎంఎస్‌ఎంఈలకు మొదటి విడతలో రూ. 450 కోట్లు రెండో విడతలో రూ.512 కోట్లు సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేశారని చెప్పారు. ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు సోషల్‌ రిఫార్మర్ సీఎం జగన్‌ అని అబ్బయ్య చౌదరి కొనియాడారు. ఎల్లో మీడియా కీయా మోటార్స్ తరలిపోతుందని తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. కీయా మోటార్స్ తమ ప్లాంట్‌ను మరింత విస్తరిస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. సౌత్ ఇండియాకు పారిశ్రామిక ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని సీఎం భావిస్తున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa