ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాపు సామాజిక వర్గంపై జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారు:మహేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 29, 2020, 04:45 PM

కాపు సామాజిక వర్గంపై జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమ చూపిస్తున్నారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విమర్శించారు. కాపులపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదన్నారు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాపులకు కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూ.2000 కోట్లు కాపులకు కేటాయించి కేవలం రూ.400 వందల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కాపులకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీలో ఉన్న కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకుండా ఉంటే చరిత్ర హీనులు అవుతాయని వ్యాఖ్యానించారు. కాపు అభివృద్ధి, సంక్షేమం పవన్ కళ్యాణ్‌నే సాధ్యమని వెంకట మహేష్ స్పష్టం చేశారు. అక్కల గాంధీ మాట్లాడుతూ...వైసీపీ కాపు నేతలు ప్రశ్నించాల్సింది పవన్ కళ్యాణ్‌ని కాదని... జగన్మోహన్ రెడ్డిని అని తెలిపారు. కాపులకు తప్పనిసరిగా 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అని స్పష్టం చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు జనసేన సిద్ధమని గాంధీ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa