కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని రుద్రవరం మండలంలో పల్లె కట్టుబాట్లు ఆచారం, అనాగరికంతో నిండు గర్భిణీ స్త్రీ శవాన్ని చెట్టుకు కట్టేసి వదిలి వెళ్ళిన గ్రామస్తులు..పల్లె కట్టుబాట్లు ఆచారం, అనాగరికం తో నిండు గర్భిణీ మహిళ శవాన్ని నల్లమల అటవీ ప్రాంతంలో చెట్టుకు కట్టేసి గ్రామస్తులు వదిలి వెళ్లారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలోని తెలుగు గంగా 19 బ్లాక్ కాలువ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది.వివరాల్లోకెళితే మండలంలోని రుద్రవరం మండలం బి.నాగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన 20 సంవత్సరాల ఓ మహిళ నిండు గర్భిణీ గా ఉండి ప్రసవ సమయంలో వైద్యం అందక మృతి చెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గర్భిణిగా ఉంటూ ఓ మహిళ చనిపోతే ఆమె మృతదేహాన్ని దహన సంస్కారాలు చేయకుండా అలాగే చెట్టుకు కట్టేసి వదిలేసే సాంప్రదాయము కట్టుబాట్లు గత కొన్ని సంవత్సరాల నుంచి రుద్రవరం ప్రాంతంలోని గ్రామాలలో నేటి జరుగుతుంది.ఈ క్రమంలోనే మృతి చెందిన మహిళా శవాన్ని నాగిరెడ్డిపల్లె పరిసర ప్రాంతాల్లో తన సంస్కారాల నిర్వహించకుండా అప్పనపల్లి ప్రాంతంలోని నల్లమల అడవులు మహిళా శవాన్ని చెట్టుకు కట్టేసి అలాగే వదిలి రావడంతో పశువుల కాపరులు గుర్తించి ఈ విషయాన్ని గురించి చర్చించుకుంటున్నారు. మహిళా శవం అలాగే చెట్టుకు కట్టేసి వదిలి వెళ్లడం వల్ల ఆమె ఆత్మ అదే ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలకు కీడు చేస్తుందని మూఢనమ్మకాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa