ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య నుంచి కాపాడండి.. హైకోర్టుకు భర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 28, 2020, 08:20 PM

తనను చిత్రహింసలు పెడుతున్న భార్య నుంచి తనను కాపాడాలని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. వారు పట్టించుకోకుండా, తనకు న్యాయం చేయడం లేదని కోర్టు మెట్లెక్కాడు. ఈ వింత ఘటన కోల్‌క‌తా న‌గ‌రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కోల్‌కతాకు చెందిన జ్యోతిర్మయి మజుందార్ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అత‌ను కోల్ కతాలో తల్లి, తండ్రి, భార్యతో కలిసి నివ‌సిస్తున్నాడు. అయితే, కరోనా లాక్‌డౌన్ ప్రారంభంలో తల్లిదండ్రులను సొంత గ్రామమైన బైద్యబతిలో వదిలి వచ్చాడు.3లాక్ డౌన్ సడలింపుల తర్వాత మ‌జుందార్‌ ఇటీవల స్వ‌గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులను కోల్‌కతాకు తీసుకొచ్చాడు. వారివల్ల కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని, అందుకే ఇంటికి తీసుకురావొద్దని భర్తను హెచ్చరించింది. అయినా వారిని ఇంటికి తీసుకురావడంతో ఆ రోజు నుంచి భర్తను వేధించడం ప్రారంభించింది. నిత్యం రోజు చెంపదెబ్బలు కొట్టడం, పిన్నులతో గుచ్చడం, సిగరెట్ల‌తో కాల్చడం చేసేది.భార్య చిత్రహింసలు భరించలేక చివరకు జ్యోతిర్మయి మజుందార్ భీదాన్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఆమె చిత్రహింసను వీడియో రికార్డుచేసి పోలీసులకు చూపించాడు. అయితే పోలీసులు ఫిర్యాదు రాసుకుని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కోల్‌క‌తా హైకోర్టును ఆశ్ర‌యించాడు. కోర్టు తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఈ కేసుపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. వీడియో సాక్ష్యం కూడా ఉండడంతో బాధితుడి భార్యకు శిక్ష పడే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa