ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాలో కొత్త లక్షణాలను బయటపెట్టిన శాస్త్రవేత్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 28, 2020, 08:07 PM

భారత్‌లో గత 24 గంటల్లో 19,906 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,28,859కు చేరింది. ఇకపోతే కరోనాలో రోజురోజుకు కొత్త కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. సాధారణంగా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకు సంబంధించి సమస్యలు వస్తే అవి కరోనాకు సంబంధించినవి. ఈ లక్షణాలున్నవారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా సోకినప్పటికీ ఈ లక్షణాలేమీ కనిపించని వారిలో విరేచనాలు, జీర్ణ సంబంధిత లక్షణాలు, ఆకలి లేకపోవడం వంటివి కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి కూడా కరోనా సోకవడం వల్లే వస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, తలనొప్పి, రుచి, వాసన గుర్తుపట్టకపోవడం, గొంతు మంట, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా కరోనా లక్షణాలే అని డాక్టర్లు చెబుతున్నారు. అయితే తాజాగా కరోనాలో మరో మూడు కొత్త లక్షణాలను అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేర్చింది. కరోనా వైరస్‌ లక్షణాలకు సంబంధించి హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలు అని తెలిపింది. ఈ లక్షణాలు వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోపు కనిపిస్తాయని ఆ సంస్థ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa