న్యూఢిల్లీ : ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ భార్యను ఇవాళ సీబీఐ ప్రశ్నించింది. మనీల్యాండరింగ్ కేసులో ఆప్ నేతలను సీబీఐ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తమపై రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నదని ఆప్ ఆరోపించింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆప్ మంత్రిపై మనీల్యాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆ కేసుకు సంబంధించి సీబీఐ ఇప్పటికే మంత్రిని ప్రశ్నించింది. మంత్రి సత్యేంద్ర జైన్ ప్రయాస్ కంపెనీలో సుమారు అయిదు కోట్ల మనీల్యాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.