ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా మందు.. రాందేవ్ పై కేసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 27, 2020, 07:14 PM

కరోనాకు మందు కనిపెట్టామంటూ ప్రకటన చేసిన యోగా గురు రాందేబ్ బాబా పై కేసు నమోదైంది. కరోనా వైరస్‌ను తగ్గించే మందు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రాందేవ్ బాబాతో పాటు మొత్తం ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాందేవ్ బాబా, పతంజలి ఆయుర్వేదిక్ సంస్థ సీఈఓ ఆచార్య బాలకృష్ణ, సైంటిస్ట్ అనురాగ్ వర్షణే, నిమ్స్ చైర్మన్ డాక్టర్ బల్బీర్ సింగ్ తోమర్, డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ తోమర్‌ పై జైపూర్‌లో కేసు నమోదు చేశారు.ఇటీవల కరోనాకు పతంజలి మందు తెచ్చిందంటూ రాందేవ్ బాబా ప్రకటించి సంచలనం సృష్టించారు. కరోనిల్ పేరుతో ఉన్న ఈ మందు వాడితే 14 రోజుల్లో వైరస్ నయం అయిపోతుందంటూ చెప్పారు. ఈనెల 23న పతంజలి సంస్థ ఈ మందును విడుదల చేసింది. అనంతరం దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా ఈ మందు తయారు చేయడానికి అనుసరించిన విధానం, ట్రయల్స్, ఇతరత్రా వివరాలు పంపాలని సూచించింది. కరోనాకు మందు అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆపాలని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa