ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాత్రూమ్‌లో 35 పిల్లలతో విషసర్పం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 27, 2020, 07:07 PM

ఏకంగా 35 పాము పిల్లలతో ఓ విషసర్పం బాత్రూమ్‌లో కాపురం పెట్టేసింది. వాటిని చూడగానే ఆ ఇంటి యజమాని అవాక్కయ్యాడు. స్నానానికి వెళ్లిన ఆయనకు పాములు కనిపించడంతో బయటకు పరుగులు తీశాడు. వెంటనే పాములను పట్టుకొనే వ్యక్తికి కాల్ చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కొయంబతూర్‌లో చోటుచేసుకుంది.కోవిలమేడు ప్రాంతంలో నివసిస్తున్న ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూమ్‌లోకి వెళ్లగా పాము పిల్లలతో ఉన్న ఓ పెద్ద విష సర్పం కనిపించింది. వెంటనే అతడు మురళీ అనే స్నేక్ క్యాచర్‌కు ఫోన్ చేశాడు. ఆ పాము, దాని పిల్లలను పట్టుకోవడానికి మురళీ చాలా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు పాముతోపాటు 35 పాము పిల్లలను పట్టుకున్న అతడు వాటిని సంచిలో వేసుకుని అనైకట్టి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa