ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెదురు పంటతో లక్షల్లో ఆదాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 27, 2020, 06:49 PM

దేశంలో రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. అందుకే ప్రభుత్వాలు, పాలకులు వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకూ రైతుల సంక్షేమం కోసం కొత్త కొత్త పథకాలను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే గతేడాది రైతుల కోసం నేషనల్ బాంబూ మిషన్ ప్రారంభించింది. వెదురు పంటతో ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశం కల్పిస్తోంది.వాస్తవానికి ఫారెస్ట్ చట్టాలు వెదురు వ్యవసాయానికి వర్తించవు. అయితే గత ప్రభుత్వాలు కఠినంగా ఉండటంతో వెదురు వ్యవసాయంపై దృష్టిపెట్టిన రైతులు తక్కువనే చెప్పాలి. ఆ తర్వాత మోడీ ప్రభుత్వం నిబంధనల్ని మార్చింది. అడవుల్లో ఉన్న వెదురు చెట్లకు మాత్రమే చట్టాలు వర్తింపజేసి ప్రైవేట్ భూమిని మినహాయించింది. నేషనల్ బాంబూ మిషన్ ఏర్పాటు చేసింది. అంతేకాదు రైతులకు ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తోంది. ఒక వెదురు మొక్క నాటితే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.120 సాయం లభిస్తుంది. ఈ విధంగా వెదురు రైతులకు లాభాలు పెంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. వెదురును మూడునాలుగేళ్ల పాటు పెంచాల్సి ఉంటుంది. నాలుగో ఏట చెట్లను నరకొచ్చు.వెదురును ఫర్నీచర్ తయారీకి ఉపయోగించొచ్చు. ప్రస్తుతం చైనా నుంచి ఫర్నీచర్ దిగుమతి చేసుకుంటున్నాం. వెదురు సాగు పెరిగితే స్థానికంగానే ఫర్నీచర్ తయారీ పెరుగుతుంది. తద్వారా చైనా నుంచి దిగుమతులు తగ్గించుకోవచ్చు. ఇటీవల వెదురుతో ఇళ్లను నిర్మిస్తున్నారు. హస్తకళల్లోనూ వెదురుకు డిమాండ్ పెరుగుతోంది. ఒక వెదురు మొక్కను మూడేళ్లు పెంచడానికి రూ.240 ఖర్చవుతుంది. అందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.120 ఆర్థిక సాయం అందుతుంది.ఒక హెక్టార్‌లో 1500 నుంచి 2500 వరకు వెదురు మొక్కల్ని నాటొచ్చు. నాలుగేళ్లు సాగు చేస్తే హెక్టార్‌కు రూ.3 నుంచి రూ.3.5 లక్షల ఆదాయం వస్తుందని అంచనా. వెదురు సాగుకు కావాల్సిన సాయం కోసం జిల్లాలోని నోడల్ ఆఫీసర్‌ను సంప్రదిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి. కాబట్టి మీరు కూడా వెదురు పంటను మొదలుపెట్టి లక్షాధికారులు అవ్వండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa