కరోనా ప్రభావంతో చిన్నారులు,గర్భిణిలు,వృద్దులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని,ఇంట్లో నుంచి బయటికి రావద్దని డాక్టర్లు సూచిస్తున్న విషయం తెలిసిందే. వారు ఇద్దరు మహిళా ఐపీఎస్ లు. ప్రస్తుతం వారు గర్భంతో ఉన్నారని న్యూస్ 18 కథనం ద్వారా తెలుస్తోంది. కరోనా ప్రభావం ఉన్నా వారు దానిని లెక్క చేయకుండా సమర్దవంతంగా విధులు నిర్వహించారు ఆ వీర వనితలు. వారిలో ఒకరు మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి కాగా మరొకరు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ.మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ప్రస్తుతం గర్భిణి. ఇటీవల సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చందనా దీప్తి దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చూశారు. ఆ సమయంలోనే ఆమె గర్భిణి అన్న విషయం అందరికి తెలిసింది. చందనా దీప్తి కరోన ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రతి రోజూ విధులకు హాజరయ్యారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు పరిష్కరించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. గర్భంతో ఉన్నా కూడా తన కర్తవ్యాన్ని నిర్వహించిన చందనా దీప్తిని అంతా అభినందిస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ కూడా ప్రస్తుతం గర్భవతి. ఆమె కూడా క్లిష్టమైన కరోనా సమయంలో విధులు నిర్వహించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. సింధుశర్మ ఇటీవలె మెటర్నిటి లీవ్ కు వెళ్లినట్టు సమాచారం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను లెక్క చేయకుండా తమ విధి నిర్వహణను నిర్వహిస్తున్న ఈ ఇద్దరు వీర నారీలకు ప్రజలందరి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇటువంటి వారితో తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్ట మరింత పెరుగుతుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ వైపు కాబోయే తల్లిగా బిడ్డను కాపాడుకుంటూనే, మరో వైపు తమ విధి నిర్వహణ కర్తవ్యాన్ని సమర్దవంతంగా నిర్వహించిన వీరు ప్రస్తుతం అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa