కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాలలోని ఓ ఆగ్రో ఫ్యాక్టరీలో విషవాయువులు లీకవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది.వివరాల్లోకి వెళ్తే ఆగ్రో ఇండస్ట్రీస్ లో అమ్మోనియా విషవాయువు లీక్ అయింది. దాంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో నంద్యాల వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. గ్యాస్ ప్రభావంతో కొందరు అపస్మార స్థితికి వెళ్లిపోయారు. స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు.ఇకపోతే విషవాయువులు లీకవుతున్నాయన్న ఘటనలో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు..జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగేదని అంతా చెప్తున్నారు. కంపెనీ యాజమాన్యం గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్టణంలో గ్యాస్ లీకైన ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయంతో హడలిపోతున్నారు. ఇకపోతే ఇటీవలే ఈ కంపెనీలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు సైతం నిర్వహించారు. విషయవాయువులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. అయినప్పటికీ విషవాయువు లీకు అవ్వడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa