ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియా ఆటగాళ్ల నివాసాల వద్ద భద్రత పెంపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 19, 2017, 11:40 AM

ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ను టీమిండియా చిత్తుచేసి, ట్రోఫీని కైవసం చేసుకుంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో పేలవమైన ప్రదర్శనతో చిరకాల ప్రత్యర్థి పాక్ తో భారత్ ఘోర ఓటమి పాలయింది. దీంతో, భారత అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆశలన్నీ అడియాసలు కావడంతో అభిమానులు మండిపడ్డారు. మ్యాచ్ ఫిక్సైందన్నారు. టీమిండియా క్రికెటర్లను దూషించారు. చేతకాని వారంటూ విమర్శలు కురిపించారు. కాన్పూర్ అభిమానులు ఒక అడుగు ముందుకు వేసి టీమిండియా క్రికెటర్ల దిష్టిబొమ్మలు, పోస్టర్లు తగులబెట్టారు. అహ్మదాబాద్ లో కొంతమంది తమ టీవీలను రోడ్డు మీదకు తెచ్చి, ధ్వంసం చేశారు. భారత క్రికెటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోహ్లీ, యువరాజ్ సింగ్, అశ్విన్ తదితర ఆటగాళ్ల పోస్టర్లను తగలబెట్టారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా రాంచీలోని ధోనీ నివాసంతో పాటు, దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర ఆటగాళ్ల నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com