ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 26, 2020, 02:09 PM

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 10, 12వ తరగతుల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకు తెలిపింది సీబీఎస్ఈ. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా కొన్ని పరీక్షలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి జూలై 15 వరకు పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది సీబీఎస్ఈ. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల్ని రద్దు చేయాలని, పరీక్షలు మిగిలిన సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు వేయాలంటూ సుప్రీం కోర్టులో విద్యార్థుల తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో 250 పాఠశాలల్లో క్లాస్ 10, 12 పరీక్షల్ని రద్దు చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లేదా ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా సీబీఎస్ఈ మార్కులు వేసిందని, అందరు విద్యార్థులకు అలాగే మార్కులు వేయాలని పేరెంట్స్ కోరారు. దీనిపై సుప్రీం కోర్టు పలుమార్లు విచారణ జరిపింది. పరీక్షల నిర్వహణపై నిర్ణయాన్ని తెలపాలంటూ సీబీఎస్ఈని సుప్రీం కోర్టు కోరింది. ఈ పిటిషన్‌పై మంగళవారం కూడా విచారణ జరిగింది. గురువారం లోగా నిర్ణయాన్ని ప్రకటిస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది సీబీఎస్ఈ. 10వ, 12వ తరగతుల పరీక్షల్ని రద్దు చేస్తున్నట్టు ఇవాళ సుప్రీం కోర్టుకు సీబీఎస్ఈ సమాచారం ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa