రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని చట్టం, ధర్మం, న్యాయం ప్రభుత్వ ఉక్కుపాదాల కింద నలిగిపోతోందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేసారు. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెంనాయుడు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చట్టాలకు, నియమాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. స్వయంగా కోర్టు అచ్చెన్నాయుడుని ఆసుపత్రిలోనే, ఎలాంటి శారీరక ఇబ్బందులు సృష్టించకుండా విచారణ చేసుకోవాలని ఆదేశించినా, అర్థరాత్రి అచ్చెన్నను బలవంతంగా తమ కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు చేసిన ప్రయత్నాలు చాలా దారుణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని, తన ఆధీనంలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది కాబట్టి ప్రతిపక్ష నేతలపై కసి, కక్ష సాధించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాగాన్ని విచ్చలవిడిగా వాడుకోవాలనే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అన్నారు సీనియర్ నేతకే ప్రభుత్వం నుంచి ఈ రకమైన ఇబ్బందులు ఎదురవుతుంటే, మిగతావారి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. జగన్ తన అధికారాన్ని ప్రతిపక్ష నాయకులపై కక్ష తీర్చుకునేందుకు వినియోగిస్తే.. ఏరకంగా సమర్థనీయమో సమాధానం చెప్పాలన్నారు. ఏడాది క్రితం ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ విధ్వంస పాలన.. ఈ మధ్య కాలంలో జరిగిన అన్యాయాలు, అరాచకాలు ఏ రాష్ట్రంలో జరిగి ఉండవన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa