మహిళా కమిషన్కు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చినట్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులు జరగడంపై సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. మహిళా సంక్షమానికి స్వచ్చంద సంస్థల సేవలు వినియోగించుకునే రీతిలో ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని ప్రశంసించారు. మహిళల సాధికారతకు కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేయాలని సీఎం సూచించినట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. అయ్యన్నపాత్రుడు ఓ మహిళా ఉద్యోగిని దూషించిన సంఘటన అందరినీ అభద్రతకి గురి చేసిందన్నారు. అయ్యన్నపాత్రుడు తప్పించుకున్నప్పటికీ న్యాయం మాత్రం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో నిర్భయ వంటి తీవ్రమైన చట్టం పెట్టినప్పుడు, చర్యలు ఉండవా అని మహిళా లోకం ప్రశ్నిస్తోందన్నారు. మహిళలను కించపరిచి మాట్లాడే వాళ్ళు భయపడే విధంగా చర్యలు కఠినంగా ఉండాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa