ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలును పగబట్టిన కరోనా..మరో 72 మందికి పాజిటివ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 25, 2020, 02:38 PM

కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత కొద్దిరోజులుగా జిల్లా ప్రజలను హడలెత్తిస్తోంది. జిల్లా వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జిల్లాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు భయంతో హడలిపోతున్నారు. మెున్నటి వరకు కరోనా దెబ్బకు పట్టణాలన్నీ వణికిపోయాయి. తాజాగా కరోనా దెబ్బకు పల్లెటూర్లు సైతం వణికిపోతున్నాయి. గత 24 గంటల్లో జిల్లాలో 72మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1555కి చేరుకున్నాయి.ఇకపోతే జిల్లాలో684మంది ఐసోలేషన్ వార్డులో చికిత్సపొందుతుండగా 827 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో ఇద్దరు మృతి చెందారు. దాంతో జిల్లాలో కరోనా మహమ్మారితో మృతి చెందిన వారి సంఖ్య 44కు చేరుకుంది. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ను పెంచింది. ఇకపోతే కరోనా పాజిటివ్ కేసులన్నీ కంటైన్మెంట్ జోన్లలోనే నమోదు అవుతున్న తరుణంలో అధికారులను మరింత కలవర పెడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa