ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరదలి పై మోజుతో..భార్యను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 25, 2020, 02:35 PM

భార్య పొట్టిగా ఉందని మరదలి పై కన్నేసిన వ్యక్తి భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్నూల్ జిల్లా బేతంచెర్ల మండలం గోరుమానుకొండ తండాకు చెందిన సుశీలాభాయికి 26 సంవత్సరాలు. ఆమెకు అలేబాదుతండాకి చెందిన రవినాయక్ తో వివాహమైంది. సుశీల పొట్టిగా ఉందని రవి అసంతృప్తికి గురయ్యాడు. దీంతో సుశీల చెల్లి పై రవికి కన్ను పడింది. ఈ విషయం తెలిసిన సుశీల రవితో తరచు గొడవ పెట్టుకునేంది. దీంతో మరదలిని పెళ్లి చేసుకోవాలంటే సుశీలను హతమార్చాలనుకున్నాడు. సుశీల చనిపోతే మరదలిని పెళ్లి చేసుకునేందుకు లైన్ క్లియర్ అయితుందని భావించాడు.తన సమీప బంధువు రేఖా నాయక్ తో కలిసి సుశీల హత్యకు రవి ప్లాన్ వేశాడు. సుశీలతో బలవంతంగా సూసైడ్ లెటర్ రాయించారు. ఆ లెటర్ ను ఇంట్లోనే ఉంచి సుశీలను రవి గొర్రెలు మేపేందుకు వెళ్దామని చెప్పి నమ్మించాడు. ఊరు చివరికి తీసుకెళ్లి బండరాయితో మోదీ ఆమెను హత్య చేశాడు. అనంతరం లోయలో పడేశాడు. తన భార్య కనిపించడం లేదని, జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన సుశీల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ కేసును పోలీసులు చేధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa