ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగులకు శుభవార్త..ఫీజు రూ.100

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 25, 2020, 02:33 PM

నిరుద్యోగులకు డీఆర్‌డీఓ శుభవార్త. ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతతో 311 పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొదట 167 సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ప్రకటించిన ఆ తర్వాత ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-ADA కోసం 18 పోస్టుల్ని కలిపి మొత్తం 185 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడు ఇదే నోటిఫికేషన్ లో 126 కొత్త పోస్టుల్ని కలిపి మొత్తం 311 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.


ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


మొత్తం ఖాళీలు: 311


విభాగాలు:


ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 81


మెకానికల్ ఇంజనీరింగ్- 82


కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్- 60


ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 12


మెటల్లార్జీ- 10


ఫిజిక్స్- 14


కెమిస్ట్రీ- 7


కెమికల్ ఇంజనీరింగ్- 11


ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 17


సివిల్ ఇంజనీరింగ్- 3


మ్యాథమెటిక్స్- 4


సైకాలజీ- 10 పోస్టులు


అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. గేట్, నెట్ స్కోర్ ఉండాలి.


దరఖాస్తు ఫీజు రూ.100 ; ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు


దరఖాస్తుకు ఆఖరి తేదీ 2020 జూలై 10


ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను rac.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa