ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డబ్బులు లేకున్నా.. రూ. లక్ష షాపింగ్ చేయొచ్చు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 25, 2020, 02:04 PM

కరోనా కారణంగా అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి కొందరు బాధపడుతుంటే.. వ్యాపారాలు దెబ్బతిని మరి కొందరు అవస్థలు పడుతున్నారు. అత్యవసర ఖర్చులకు కూడా డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డులు మనల్ని ఆదుకుంటాయి. అయితే క్రెడిట్ కార్డులు లేనివారిని వ్యాలెట్ సంస్థలు అందిస్తున్న పోస్ట్‌పెయిడ్ సర్వీసులు అందిస్తున్నాయి. పేటీఎం పోస్ట్‌పెయిడ్ ఫీచర్ కూడా అలాంటిదే.దీని ద్వారా యూజర్లు రూ.1,00,000 వరకు క్రెడిట్ లిమిట్ వాడుకోవచ్చు. గతంలో ఈ లిమిట్ తక్కువగా ఉండేది. కానీ కరోనా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని లిమిట్‌ను రూ.1,00,000 వరకు పేటీఎం పెంచింది. యూజర్లు ఈ లిమిట్‌లో తమకు కావాల్సినంత డిజిటల్ పేమెంట్స్ ద్వారా వాడుకోవచ్చు. ఆ డబ్బును వచ్చే నెలలో పేమెంట్ చేయొచ్చు. లేదా ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. అయితే పేటీఎం నెలవారీ ఖర్చులపై 0 నుంచి 4 శాతం వరకు కన్వీనెన్స్ ఫీజు వసూలు చేస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి.కిరాణా షాపులు, మెడికల్ షాపులు, రిలయెన్స్ ఫ్రెష్ లాంటి సూపర్ మార్కెట్స్‌లో పేటీఎం పోస్ట్‌పెయిడ్ సర్వీస్ ద్వారా యూజర్లు సులువుగా చెల్లించవచ్చు. ఇందుకోసం పేటీఎం యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ సర్వీస్ లైట్, డిలైట్, ఎలైట్ పేర్లతో మూడు రకాలుగా ఉంటుంది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ లైట్‌లో మంత్లీ లిమిట్ రూ.20,000, డిలైట్, ఎలైట్‌లో రూ.20,000 నుంచి రూ.1,00,000 వరకు ఖర్చు చేయొచ్చు.డిలైట్, ఎలైట్ ఫెసిలిటీ ఉపయోగించుకునేవారికి కన్వీనెన్స్ ఛార్జీలు ఉండవు. పేటీఎం పోస్ట్‌పెయిడ్ వాడుకోవాలంటే ముందుగా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్ పైన ‘Paytm Postpaid’ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. పేటీఎం పోస్ట్‌పెయిడ్ సర్వీస్ యాక్టివేట్ చేయాలంటే ముందుగా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. క్రెడిట్ స్కోర్‌ను బట్టి మీకు ఎంత లిమిట్ ఇవ్వాలన్నది పేటీఎం నిర్ణయిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa