ఈ చిత్రంలోని పిల్లల వయస్సు 7 నుంచి 11 ఏళ్ల లోపే. సెలవులు కావడంతో వారు ఆడుకోవడానికి వెళ్తున్నారనుకుంటే పొరపాటే. వారంతా బయలుదేరింది బార్డర్ కు. కారణం మన సైనికులను చంపిన చైనా సైనికులపై ప్రతీకారం తీర్చుకోవడానికి. ఏంటి ఇదంతా సినిమా స్టోరీ కావొచ్చు అని అనుకుంటుంటే పొరపాటే. ఈ ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాలోని అమ్రాద్ పూర్ లో. ఆ ప్రాంతంలోని 10 మంది పిల్లలు తమకు సమీపంలోని చైన్ బార్డర్ వైపు పరిగెడుతుండగా పోలీసులు గమనించి అడ్డుకున్నారు. "ఏయ్.. ఎటు వెళ్తున్నారు. ఇది బార్డర్ ఏరియా... అటు వెళ్లకూడదు" అని పోలీసులు హెచ్చరించారు. అయితే ఏమాత్రం భయపడకుండా ‘అవును సార్... అది బోర్డర్ కాబట్టే అటు వెళ్తున్నాం’ అన్నాడు వారిలో ఒకడైన కరణ్.ఎందుకు అని ఆ పోలీసులు ఆశ్చర్యంతో అడగగా "మన సైన్యాన్ని చంపారు.. మన తడాఖా చూపిస్తాం. ప్రతీకారం తీర్చుకుంటాం... భారత్ మాతాకీ జై" అంటూ ఆవేశంతో ఆ పిల్లలు నినాదాలు చేశారు. మళ్లీ ఆశ్చర్యపోయిన పోలీసులు మీరు పిల్లలు కదా.. మరి చైనా సైన్యంతో పోరాటం చేయగలరా అని అడిగితే... పిల్లలంతా ధైర్యంగా ఖచ్చితంగా చేస్తాం అంటూ సమాధానమిచ్చారు. ఆ పిల్లల్లో దేశ భక్తిని చూసి ఆ పోలీసులు ముచ్చటపడ్డారు. ఓకే... ఆ సైనికుల వీర మరణానికి మనం ప్రతీకారం తీర్చుకుందాం. ఇప్పటికైతే మీరు ఇళ్లకు వెళ్లి బాగా చదువుకోండని చెప్పి ఆ పిల్లలను ఇంటికి పంచించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు వీరి దేశభక్తిని అభినందిస్తూ సలాం కొడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa