ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు: ఆలయ అర్చకుడికి కరోనా పాజిటివ్..భక్తుల్లో టెన్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 04:46 PM

కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చుకుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని అదికారులు తెలిపారు. దీంతో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మఠం పెద్దల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత రెండు మూడు రోజులుగా 400 కు పైగా కేసులు నమోదయ్యాయి ఏపీలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పోలీసు సిబ్బంది రాజకీయ నేతలకు కరోనా టెన్షన్ తప్పడం లేదు. అంతేకాదు ఆలయాల్లో పనిచేసే అర్చకులను సైతం కరోనా వదలటం లేదు.చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడికి కరోనా పాజిటివ్ నిర్థారణకాగా తాజాగా కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చుకుడికి వైరస్ సోకింది. దీంతో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మఠం పెద్దల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన తర్వాత దర్శనం కల్పిస్తామన్నారు. అంతేకాదు అర్చకుడికి సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa