ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెత్తుటి చెరువులో నిజంగా దయ్యాలు ఉన్నాయా? ఇప్పటికీ మిస్టరీనే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 04:44 PM

మనలో దైవాన్ని నమ్మేవారు ఉన్నట్లే ఆత్మలను దయ్యాలను నమ్మేవారు కూడా కొందరు ఉన్నారు. అయితే నిజంగా దయ్యాలు, ఆత్మలు ఉన్నాయా అంటే? ఇప్పటికీ భిన్న వాదనలే వినిపిస్తుంటాయి. ఇక్కడ ఉన్న ప్రదేశంలో ఒక నెత్తుటి చెరువు ఉంది? ఇందులో దయ్యాలు ఉంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఆ రక్తపు చెరువు ఎక్కడ ఉంది? అక్కడి స్థానికులు అందులో దయ్యాలు ఉన్నాయని ఎందుకు అంటున్నారనేది తెలుసుకుందాం...ఉత్తర చిలీ దేశంలోని కెమినా నగరానికి 147 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3,700 ఎత్తులో ఉన్న మర్మమైన ఈ చెరువులోని నెత్తుటిరంగులో ఉంటుంది. పూర్వం ఇక్కడ అయమరా జాతి వారు నివసించేవారు. వీరు వారి సంస్కృతి గురించి, దేశ ఆచారాల గురించి, దేశ పెద్దల గురించిన రహస్యాలను కాపాడేవారట. ఈ విషయం కూడా ఈ మధ్యే తెలుసుకోగలిగారు. ఈజిప్ట్ పిరమిడ్ సమాధుల శాపాల గురించిన మర్మం ఎలా రహస్యంగా ఉంచబడిందో ఈ చెరువు గురించిన మర్మం కూడా అంతే రహస్యంగా ఉంచబడింది. అందువలనే ఈ చెరువు గురించి ప్రపంచానికి తెలియలేదని చెబుతున్నారు.ఇక ఈ చెరువులోని నీటిని ముట్టుకున్నా, లేక ఈ చెరువు దగ్గరకు ఎవరు వెళ్లినా వారు శాపానికి గురవుతారని స్థానికులు చెప్పారు. అందువలనే ఈ చెరువు గురించి ఎవరికీ చెప్పలేదని పేర్కొన్నారు. ఈ చెరువులో దయ్యాలున్నాయని వారు చెప్తుంటారు. అందువలనే ఈ చెరువు ఏ మ్యాపులోనూ కనబడలేదు. ఇంకా ఈ చెరువు నీరు తాగినందు వలనే అయమరా జాతివారిలో అనేక మంది చనిపోయారని చెబుతారు. ఈ ఎర్ర చెరువును చుట్టూ ఒక పచ్చనీటి చెరువు మరియూ పసుపు నీటి చెరువు కూడా ఉన్నాయి. ఈ చెరువుల దగ్గరకు ఎవరైనా వెళితే ఆ చెరువులలోని నీరు బుడగలతో పైకి ఎగతన్నుకుని వస్తుంది. అందువలన ఈ మూడు చెరువులు దెయ్యాలకు సొంతమని అక్కడి ప్రజల విశ్వసిస్తూ ఉంటారు. కానీ ఈ మూడు చెరువులు, దయ్యాల మిస్టరీ ఇప్పటికీ అంతుచిక్కకుండానే ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa