ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోర్ఖాల్యాండ్ లో హింస వెనుక కుట్ర: మమతా బెనర్జీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 18, 2017, 02:15 PM

ఎవరో వెనుక ఉండి డార్జిలింగ్ లో ఆందోళనలు నడిపిస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఆందోళనకారులు ఆయుధాలతో దాడులు చేస్తున్నారని, వారికి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదని, దీని వెనుక చాలారోజులుగా కుట్ర జరుగుతోందని అన్నారు. గూర్ఖాల్యాండ్ లో జరుగుతున్న బంద్ చట్టవ్యతిరేకమని, కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి వారు ఆందోళనలు చేస్తున్నారని మమత అన్నారు. దేశ సరిహద్దుల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం భద్రతకు ముప్పు కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, ఆందోళనల్లో అసిస్టెంట్ కమాండర్ మరణించడం బాధాకరమన్నారు. ఆందోళనకారులు పలువురు జర్నలిస్టులను కూడా కిడ్నాప్ చేశారని మమత ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com