ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా మందు మార్కెట్లోకి ఎప్పుడంటే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 21, 2020, 04:58 PM

ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టేందుకు మందును తయారుచేసినట్లు భారత్‌కు చెందిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఔషధాన్ని విక్రయించేందుకు దేశీయ ఔషధ‌ కంపెనీలు సిప్లా, హెటిరోకు అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీజీసీఐ) అనుమతి పత్రాలను మంజూరు చేసినట్లు ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘కోవిఫర్‌’ పేరుతో జనరిక్‌ మందు అమ్మకానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లు వెల్లడించింది.రాబోయే రెండు వారాల్లో ఈ డ్రగ్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని హెటిరో తెలిపింది. అందరికీ, ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరకు కరోనా మందును అందుబాటులో తీసుకువస్తామని హెటిరో ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇంజక్షన్‌ రూపంలో ‘కోవిఫర్‌ 100 ఎంజీ’ మార్కెట్‌లోకి రానుంది. కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారందరికీ ఈ ఇంజెక్షన్‌ పనిచేస్తుందని ఆ కంపెనీ చెప్పింది. హైదరాబాద్‌ హెటిరోకు కోవిడ్‌కు మందును కనిపెట్టిన ఘనత దక్కిండంతో సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. ఇక కరోనా యాంటీ డ్రగ్‌ సిప్లా, హెటిరో సంస్థల ఆధ్వర్యంలో మార్కెట్లోకి రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa