ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే నిమ్మలరామనాయడు మీడియా సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 21, 2020, 04:28 PM

పార్లమెంట్ ఉభయసభల్లో 30 మందికి పైగా వైసీపీ సభ్యులుతో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మలరామనాయడు. ఏడాది కాలంగా రైల్వేజోన్, విభజన హామీల అమలు గురించి వైకాపా ఎంపీలు ఎందుకు నోరు మెదప లేదని ప్రశ్నించారు? హోదా గురించి వైసీపీ ఎంపీలు ఏడాది కాలంగా ఒక్కసారి మాత్రమే అడిగారని కేంద్రమంత్రి పార్లమెంట్ లో చెప్పడం వాస్తవం కాదా? అన్నారు. లోక్ సభలో ముగ్గురు టీడీపీ ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నారని ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీశారని గుర్తు చేసారు. వైసీపీ కొత్తగా ఇచ్చిన రాజ్యసభ సీట్లు కూడా పైరవీలు చేసుకునేందుకు ఇచ్చినవేనని విమర్శించారు. వైఎస్ ని చంపిన వ్యక్తి చెప్పాడని పరమళ నత్వానీకి రాజ్యసభ సీటు కట్టబెట్టడం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తీవ్ర వైకాయలు చేశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చి గౌరవించారని ఎద్దేవా చేసారు. జగన్ తో అక్రమాస్తుల కేసుల్లో ముద్దాయిగా ఉన్న మోపిదేవి వెంకటరమణకు రాజ్యసభ పదవి ఇచ్చి సత్కరించారని తన సహ నిందితుడిని ఆ విధంగా గౌరవించారని వ్యాఖ్యానించారు. 151 శాసనసభ్యులు, 22 ఎంపీలు 51% దళిత ఓట్లతో గెలిచినప్పటికీ ఒక్క రాజ్యసభ సీటు దళితునికి ఇచ్చి గౌరవించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లుగా ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఇప్పుడు కూడా రాజ్యసభ పదవులు మాత్రం పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa