ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు సంస్థలకు లీగల్‌ నోటీసులు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 21, 2020, 04:23 PM

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర భూగర్భ గనుల శాఖ పరువు నష్టం దావా వేసింది. గుంటూరు జిల్లాలో సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌కు సున్నపురాయి మైనింగ్‌ లీజు వ్యవహారంలో ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా వార్తలు రాశాయని ఆరోపిస్తూ ఉషోదయా పబ్లికేషన్స్ (ఈనాడు), ఆమోద పబ్లికేషన్స్ (ఆంధ్రజ్యోతి)తోపాటు అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపినట్టు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంచాలకులు వెంకటరెడ్డి తెలిపారు. 15 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరంగా ప్రభుత్వం సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటుందంటూ చంద్రబాబుతోపాటు ఆ రెండు సంస్థలకు లీగల్‌ నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. అలాగే, నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం ఉద్దేశించిన సంచులను ప్రభుత్వం టెండర్లు పిలవకుండానే సీఎం వైఎస్ జగన్‌కు సంబంధించిన సంస్థ నుంచి కొనుగోలు చేసిందంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు, ఆ వార్తను ప్రచురించిన ఈనాడు పత్రిక ఫౌండర్‌ డైరెక్టర్ రామోజీరావు, ఎడిటర్ ఎం.నాగేశ్వరరావులకు ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ చేసింది. ఇవి అందిన ఏడు రోజుల్లోనే క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa