ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల కోసం మోడీ స్కీమ్..రూ.1కే న్యాప్కిన్స్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 19, 2020, 04:41 PM

లాక్ డౌన్ సమయంలో మహిళలు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చౌక ధరకే న్యాప్కిన్స్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన్ మంత్రి భారతీయ జన్‌ఔషధి కేంద్రాలకు కేంద్రం శానిటరీ న్యాప్కిక్స్ అందిస్తోంది. మార్కెట్ ధర కన్నా వీటి ధర చాలా తక్కువగా ఉంటుంది. జన్‌ఔషధి కేంద్రాలకు వెళ్లి కేవలం రూ.1కే న్యాప్కిన్స్ కొనుగోలు చేయొచ్చు. మార్కెట్‌లో శానిటరీ న్యాప్కిన్ ధర రూ.8 వరకు ఉంటుంది. అదే మీరు ఇక్క రూ.1కే కొనొచ్చు. మహిళల ఆరోగ్యం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2018లోనే జనఔషధి సువిధ ఆక్సో బయోడీగ్రేడబుల్ శానిటరీ న్యాపిక్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జనఔషధి కేంద్రాల ద్వారా 4.6 కోట్ల న్యాప్కిన్స్‌ను విక్రయించారు. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్ట్‌లో న్యాప్కిన్ ధరను రూ.1కి తగ్గించింది. ఈ న్యాప్కిన్స్ వల్ల పర్యావరణానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు. ఇది బయలాజికల్లీ డీగ్రేడబుల్ ఆక్సో బయోడీగ్రేడబుల్ మెటీరియల్‌తో తయారు అవుతాయి. ఏఎస్‌టీఎం డీ6954 ప్రమాణాలకు అనుగుణంగా తయారు అవుతాయి. కోవిడ్ 19 లాక్ డౌన్ పరిస్థితుల్లోనూ జనఔషధి కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. అందువల్ల ఎవరైనా తక్కువ ధరకే న్యాప్కిన్స్ కొనుగోలు చేయాలని భావిస్తే జనఔషధి కేంద్రాలకు వెళ్లొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa