ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరి బెదిరింపులకూ లొంగను: జేసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 18, 2020, 01:59 PM

సీఎం జగన్ బెదిరింపులకు తాను భయపడనని ఆయనకు లొంగబోనని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జేసీ ట్రావెల్స్‌‌ వాహనాలకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించారనే కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని శనివారం అనంతపురం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనాలన్నది సీఎం జగన్ ఆలోచన అని జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. తనను లక్ష్యంగా చేసుకుని తన లారీలు, బస్సులను ఆపేశారని, తన వ్యాపారాన్ని దెబ్బతీయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను మాత్రం ఎలాంటి బెదిరింపులకు లొంగనని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa