ఏపీ శాసన మండలిలో టీడీపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ టీడీపీ నేత కేఈ ప్రభాకర్ పార్టీకి దూరంగా ఉన్నారు. శాసన మండలిలో కేఈ ప్రభాకర్ టీడీపీకి దూరంగా ఉన్నారు. గవర్నర్ ప్రసంగం సాగుతున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తున్నారు. అయినప్పటికీ కేఈ ప్రభాకర్ కిమ్మనకుండా కూర్చునే ఉన్నారు. తోటి టీడీపీ ఎమ్మెల్సీలతోనూ అసలు కలవనే లేదు. అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను అణచివేస్తోందనే కారణంతో ఉభయ సభల నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేసినా కేఈ ప్రభాకర్ మాత్రం సభ లోపలే ఉండిపోయారు. తమతో పాటు రావాలంటూ తోటి సభ్యులు పిలిచినప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఈ పరిణామాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు.దాంతో చంద్రబాబు కేఈ ప్రభాకర్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై శాసన మండలిలో టీడీపీ నోటీసు లిచ్చింది. వికేంద్రీకరణ బిల్లులపై చర్చించకూడదని రూల్ 90 కింద టీడీపీ శాసన మండలి పక్షం నోటీసులు ఇచ్చింది. ఈ బిల్లులు గతంలోనే సెలెక్ట్ కమిటీ ముందున్నాయని నోటీసులో పేర్కొంది. గతంలో ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినా సెక్రటరీ దానికి అనుగుణంగా వ్యవహరించ లేదని తెలిపింది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం మండలి ఛైర్మనుకు ఉందని నోటీసులో టీడీపీ అభిప్రాయపడింది. ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకే పంపాలని నోటీసులో టీడీపీ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొందరు ఎమ్మెల్సీలు మండలికి గైర్హాజరయ్యారు.టీడీపీ తమకు 23 మంది సభ్యుల బలం ఉందని చెప్తోంది. దాంతో బలం నిరూపించేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారు. కేఈ ప్రభాకర్ కు ఫోన్ చేసి శాసన మండలిలో జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. అయితే పార్టీలో చిన్న విషయాలు తప్ప తనకు ఎలాంటి ఇబ్బందులేమీ లేవని కేఈ ప్రభాకర్ చెప్పినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి స్వయానా సోదరుడు కేఈ ప్రభాకర్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa