చెన్నై :తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రంజాన్ సందర్భంగా ఈ నెల 21వ తేదీన ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఎఐఎడిఎంకె ప్రతియేటా నిర్వహించే ఇఫ్తార్ విందు ఈ ఏడాది పళనిస్వామి నేతృత్వంలో జరుగనున్నది. పళనిస్వామి ఇఫ్తార్ విందును ఇక్కడి చెన్నై ట్రేడ్ సెంటర్లో నిర్వహించనున్నారు. గత ఏడాది ఇఫ్తార్ విందును అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత నిర్వహించారు.