ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెట్టినింటికి కన్నమేసి నగలతో పారిపోయిన నవవధువు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 15, 2020, 06:36 PM

అత్తారింటికి వచ్చిన నవవధువు సరిగ్గా నెలరోజులకే మెట్టినింటికి కన్నమేసి పారిపోయిన దారుణఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. చెప్పాపెట్టకుండా పుట్టింటికి వెళ్లిపోయిన భార్య ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఫోన్ చేసిన అల్లుడికి దిమ్మతిరిగిపోయే షాకిచ్చాడు మామ. తన కూతురు ఇక ఎప్పటికీ తిరిగిరాదని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన అల్లుడు పోలీసులను ఆశ్రయించాడు.నగరంలోని నరోడా ఏరియాకి చెందిన జయేష్ రాథోడ్‌కి రాజస్థాన్ కు చెందిన కళావతికి నెలరోజుల క్రితం వివాహం జరిగింది. పెళ్ళికి ముందు కళావతి తండ్రి జయేష్ దగ్గర రూ.1.55 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. మెట్టినింటికి వచ్చిన కళావతి నెల రోజులకే అత్తారింటిని సర్దేసింది. నగలు, ఇతరు విలువైన వస్తువులతో ఉడాయించింది. పుట్టింటికి వెళ్లి ఉంటుందని భావించిన భర్త ఎన్నిరోజులైనా తిరిగి రాకపోవడంతో రాజస్థాన్‌లో ఉన్న మామకి ఫోన్ చేయడంతో అల్లుడి దిమ్మతిరిగిపోయింది. తన కూతురు ఇంకెప్పటికీ అక్కడికి రాదని చెప్పడంతో కంగుతిన్నాడు.డబ్బులు, నగల కోసమే పెళ్లి చేసుకున్నట్లు చెప్పడంతో షాక్‌కి గురయ్యాడు. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో భయపడిన జయేష్ పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లి పేరుతో డబ్బు, నగలు దోచుకున్నారని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa