ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయా? పెరిగాయా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 15, 2020, 06:14 PM

బులియన్ మార్కెట్ లో సోమవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ.600 పైన, హైదరాబాద్‌లో రూ.200 పైన తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.210 తగ్గడంతో రూ.49,450 ధరకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.210 తగ్గడంతో రూ.45,320 ధరకు చేరుకుంది. కేజీ వెండిపై ఏకంగా రూ.610 తగ్గడంతో రూ.47,100 ధరకు చేరుకుంది. మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో బంగారం ధర భారీగా పడిపోయింది. గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 1.28 శాతం అంటే రూ.607 తగ్గడంతో రూ.46,727 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్‌లో వెండి ధర కూడా తగ్గింది. సిల్వర్ జూలై ఫ్యూచర్స్ కిలోపై 1.45 శాతం అంటే రూ.690 తగ్గి రూ.47,000 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa