ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నదీ గర్భంలో నుండి బయటపడిన 500 ఏళ్ల పురాతన ఆలయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 15, 2020, 06:03 PM

500 ఏళ్ల నాటి పురాతన ఆలయం చాలా ఏళ్ల క్రితం నీట మునిగింది. 150 ఏళ్ల క్రితం భారీ వరదలు రావడంతో పలు గ్రామాలు నదిలో కలిసిపోయాయి. అలా నదీ గర్భంలో కలిసిన ఓ ఆలయం.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ బయటపడింది.ఒడిశాలోని మహానదిలో ఓ పురాతన ఆలయం బయటపడింది. నది మధ్యలో ఆలయం ఉన్నట్లు కొందరు మత్స్యకారులు గుర్తించారు. నయాగఢ్ సమీపంలోని పద్మావతి గ్రామంలో బైదేశ్వర్ వద్ద నదీ మధ్యలో ఈ పురాతన ఆలయం బయటపడింది. 60 ఫీట్ల పొడవైన ఈ దేవాలయం 15 లేదా 16వ శతాబ్ధానికి చెందిన ఆలయమని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరలర్ హెరిటేజ్ (INTACH) ప్రతినిధులు తెలిపారు.అది విష్ణమూర్తి అవతారమైన గోపీనాథుడి ఆలయమని అధికారులు వెల్లడించారు. 150 ఏళ్ల క్రితం భారీ వరదలు రావడంతో మహానదిలో ఏడు గ్రామాలు మునిగిపోయాయని.. నది గర్భంలో మరో 22 ఆలయాలు ఉన్నాయని తెలిపారు. నది మధ్యలో నీటి ప్రవాహం తగ్గిన సమయంలో అప్పుడప్పుడూ గోపీ నాథుడి ఆలయం పైకి కనిపిస్తుందని చెప్పారు. ఆ గుడిని చూసేందుకు స్థానికులు భారీగా తరలి వస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa