ఆళ్లగడ్డ,మేజర్న్యూస్ఃరాయలసీమకు నీటి విషయంలో అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదని నంద్యాల మాజీ పార్లమెంట్సభ్యులు గంగుల ప్రతాపరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టి మూడు సంవత్పరాలు ఐన ప్రాజెక్ట్ ల నిర్మాణం పూర్తి చేయలేదన్నారు.రాయలసీమ ప్రజలు సాగునీటి విషయంలో తమకు న్యాయం జరుగాలని కోరుకుంటు న్నారన్నారు.సీమలో తుంగభధ్ర,పెన్నానదులు ఉన్నప్ప టికి ఎక్కువగా కృష్ణానదిపైనే పీమ వాసులు వ్యవసా యం మీద ఆధారపడ్డాన్నారు.
అనేకసంవత్పరాలుగా పోరాటం చేసి సాధించుకున్న ప్రాజెక్ట్లు ఈ మూడు సంవత్సరాలలో పూర్తికాకపోవడం తోవారిని నిరాశకు గురిచేస్తోందన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు.కొన్నిప్రాజెక్ట్లు పూర్తయిన బ్రాంచ్ కాల్వలు, లైనింగ్ కాల్వలు,పంటకాల్వల నిర్మాణం జరుగకపొవడం బాధాకరమ న్నారు.అనంతపురం జిల్లా కు ఇచ్చిన 10టిఎంసిల నీటిని ఇక్కడ భర్తీ చేసుకోవ డానికి సుంకేసుల వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజి కెపాసిటి పెంచడం వల్ల 7టిఎంసి ల నీరు,అబ్దులాపురం రిజర్వాయర్ ద్వారా మరో 3టిఎంసిలు నీరు పొందవచ్చ న్నారు.అయితే దీనిపై చర్చ ప్రభుత్వం చేయకపోవడం బాధాకరమన్నారు. గాలేరునగరి పనులు పూర్తి నత్తనడకన జరుగుతున్నాయని,యస్ఆర్బిసిలో భాగమైన గోరుకల్లు రిజర్వాయర్లో నీరు నిల్వ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదని విమర్శిం చారు.శ్రీశైలం జలాశయంలో రాచలసీమ వాసులకు హక్కు ఉందని ఆవిషయాన్ని ప్రభుత్వం మరచిపో వడం క్షమార్హం కాదన్నారు.ప్రభుత్వం పదేపదే రాయలసీమ విషయంలో తప్పులు చేస్తోందని సీమ వాసులు రెచ్చిపోయి ఉద్యమాలు చేసే రోజులు రానున్నాయని ఆయన టిడిపి ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు.శ్రీశలైంలో 865 అడుగుల నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకుంటే రాయలసీమకు ప్రయోజనం ఉంటుందన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సీమ ప్రయోజనాలపై దృష్టి సారించి సీమకు సాగునీరు అందించే విషయంలో శ్రధ్ద వహించాలని హితవు పలికారు.శ్రీశైలం రిజార్వయర్పై రాయలసీమకు,తెలంగాణాకు మాత్రమే హక్కు ఉందన్నారు.సీమకు తలమానికమైన కేసి కెనాల్ నేడు మురికి కాల్వగా దర్శనమిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీమ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే సీమ సమస్యలపై పోరాడుతున్న ప్రజాసంఘాలు,వ్యక్తులతో కలిసి ప్రజల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని మాజీ యంపి గంగుల ప్రతాపరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈసమావేశంలో నీటసంఘం నాయకులు సిద్దంరెడ్డి జాఫర్రెడ్డి పాల్గొన్నారు.