శ్రీమహావిష్ణువు అవతారాల్లో రామావతారం ఏడవదిగా చెబుతారు. లోకకల్యాణం కోసం శ్రీ మహావిష్ణువు మానవ అవతారంలో అవతరించినదే శ్రీరామావతారం. శ్రీరాముడు జన్మించిన ప్రదేశం, శ్రీరాముడు వనవాస కాలంలో నివసించిన ప్రదేశాలు, స్వయంభువుగా వెలసిన ఆలయాలు, ప్రత్యేకతలు కలిగి ఉన్న కొన్ని రామాలయాలు ఉన్నవి. మరి ఈ ఆలయాల్లో శ్రీరాముడు ఎలా దర్శనమిస్తాడు? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యోగరామాలయం:
తమిళనాడు రాష్ట్రంలో ఈ యోగరామాలయం ఉంది. రాముడు యోగభంగిమలో కనిపించే ఆలయాలు ఈ ప్రాంతంలో మూడున్నాయి. ఈ ఆలయం చెంత శుకమహర్షి ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో శుకబ్రహ్మ ఆసీనుడై ఉండగా, హనుమంతుడు ధర్మశాస్త్రాలను చదివి, రామలక్ష్మణులకు, శుకునికి వినిపిస్తూ ఉన్నట్లుగా ఉన్న అరుదైన విగ్రహాలను చూడవచ్చు.
శ్రీ విజయరాఘవస్వామి దేవాలయం:
చేవెళ్లకు వెళ్లే హైదరాబాద్ ప్రధాన రహదారి మార్గంలో లంగర్ హౌస్ ప్రాంతంలో బాపూఘాట్ కు సమీపంలో శ్రీ విజయరాఘవస్వామి దేవాలయం ఉన్నది. శ్రీరాముడు లక్ష్మణ సమేతంగా తానీషాకు ఆరులక్షల రూపాయలు జమకట్టి రసీదు పుచ్చుకొని అనంతరం ఈ ఆలయంలో సుప్రతిష్ఠితుడైనాడని భక్తుల నమ్మకం. అందుకే మరెక్కడా లేనివిధంగా ఇక్కడ శ్రీరాముడు వీరవెంకట విజయరాఘవస్వామిగా వెలిశాడని స్థల పురాణం చెబుతుంది.
రామస్వామి :
కుంభకోణంలో శ్రీ ఆది కుంభేశ్వరాలయానికి దగ్గరగా ప్రసిద్ధమైన రామస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీతాదేవి ఒక పీఠంపై కొలువుదీరి ఉండటం విశేషం అయితే హనుమంతుడు వీణపై స్వామివార్లను స్తుతిస్తూ ఉన్నట్లు విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa